రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట
బిటి రోడ్డు పునరుద్దరణ పనులకు భూమి పూజ
.5 కోట్ల41 లక్షలతో పనులు
త్వరితగతినపనులు పూర్తి చేయాలి
మంత్రి గంగుల కమలాకర్
విజయవాడ ముచ్చట్లు:

రోడ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని…కరీంనగర్ నగరంలో 14.5 కిలోమీటర్ల పరిధిలలోని వివిధ కారణాలతో ధ్వంస మైన బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు 5కోట్ల 41లక్షలతో పనులు చేపడుతున్నట్టు మంత్రిగంలో కమలాకర్ వెల్లడించారు.నేడు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి చౌరస్తాలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తో కలిసిరోడ్డు పునరుద్దరణ పనులకు భూమి బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ పూజ చేశారు.
ఈ సందర్భంగా మాంత్రి గంగుల కమలాకర్మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు, మంచి నీటి పైపులైన్ల తవ్వకాలతో చాలాచోట్ల బీటీ రోడ్లు ధ్వంసం అయ్యాయని… వాటి పునరుద్దరణ పనులకు తెలంగాణ ప్రభుత్వం అడగగానే నిధులు కేటాఇంచిందని అన్నారు… రాష్ట్ర ప్రభుత్వంరోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తుందని అన్నారు.. రోడ్డు నిర్మాణ పనులు వర్షాకాలం లోపు త్వరితగాతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.ఈ కార్యక్రమం లో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు కార్పొరేటర్లు మేచినేని వేచినేని వనజ -అశోక్ రావు, నాంపల్లి శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు అంజాత్, గౌతమ్ రెడ్డి,ఆర్ &బి ఈ ఈ సాంబశివరావు డి ఈ రవీందర్, ఏ ఈ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
Tags:The government is responsible for the construction of roads
