పుంగనూరులో కార్మికుల సేవలు మరువలేనిది
పుంగనూరు ముచ్చట్లు
సమాజంలో అన్ని రకాల సేవలు అందిస్తున్న కార్మికుల సేవలు మరువలేనిదని , వారి రుణం తీర్చుకోలేనిదని సీనియర్ సివిల్జడ్జి వాసుదేవరావు అన్నారు. సోమవారం మేడేని పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయంలో కార్మిక దినోత్సవం నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ వివిధ రంగాలలో పని చేస్తున్న కార్మికులకు ప్రభుత్వపరంగా వారికి అందాల్సిన స్కీములు, రాయితీలు, భీమా సౌకర్యాలు అందించాలన్నారు. కార్మికులు లేకపోతే నిత్యజీవితంలో అందరు కష్టపడాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి చోట కార్మికులు అవసరమని , వారిని గుర్తించి గౌరవించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రసూల్ఖాన్, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటసుబ్బయ్య, న్యాయవాది షమివుల్లా, కార్మికులు పాల్గొన్నారు.
Tags; The labor services in Punganur are unforgettable