Natyam ad

దేశంలోనే అతిపెద్ద స్మశాన వాటిక సిద్దం

రంగారెడ్డి ముచ్చట్లు:


దేశం లోనే అతి పెద్ద స్మశాన వాటిక ను హైద్రాబాద్ లో నాగోల్ ఫతుల్లగూడ లో హెచ్ఎండీయే ఏర్పాటు చేసింది. ఆరు ఎకరాల విస్తీర్ణంలో మూడు మతాల స్మశాన వాటిక నిర్మించింది. #  అత్యాధునిక  హంగులతో పర్యావరణానికి అనుగుణంగా  అతి పెద్ద స్మశానవాటిక ఏర్పాటు అయింది. # సర్వమతాలకు చెందిన అతి పెద్ద స్మశాన వాటిక ను ఒకే దగ్గర ఏర్పాటు చేస్తు ….సరి కొత్త ఓర్వడికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. # 25 కోట్ల రూపాయల తో అల్ రిలీజియన్ గ్రేవీయార్డ్ ను నిర్మిస్తుంది.  హిందువులకు 2 ఎకరాలు, ముస్లీం లకు 2 ఎకరాలు , క్రిస్టియన్ లకు 2 ఎకరాలు కేటాయించారు.  బ్రాహ్మణుల కోసం అపర కర్మల భవనం ఏర్పాటు అయింది.  దాదాపు 50 వేల మొక్కల తో ఆహ్లదకరం గా ఉండే విధంగా గ్రినరీ ఏర్పాటు చేస్తున్నారు.  ఈ స్మశాన వాటిక లో  కట్టే కాల్చడం నిషేధం.  సోలార్ పవర్ తో నడిచే విద్యుత్ దహన వాటిక, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తున్నారు.  విదేశాల్లో ఉండే వారు,  వాళ్ళ బంధువుల దహన సంస్కారాలు చూసేందుకు ప్రత్యేక ప్రసారాలు ఏర్పాటు,  పచ్చని పూదోటలులతో ఈ స్మశాన వాటిక  నెలలోనే అందుబాటు లోకి రానుంది.

 

Tags: The largest cemetery in the country is ready

Post Midle
Post Midle