– నాటి ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం
Date:14/09/2019
పుంగనూరు ముచ్చట్లు:
రాయలసీమ జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా 1772 సంవత్సరంలో పుంగనూరు జమీందారు ఇమ్మడి చిక్కరాయతమ్మేగౌని భార్య ముద్దమ్మణి నిర్మించారు. పుంగనూరు పట్టణంలోని కోనేటి పాళ్యెం రోడ్డు వద్ద గల శ్రీ కాశివిశ్వేశ్వరస్వామి ఆలయ సమీపంలో నిర్మించారు. దీనిని అత్యంత అద్భుతంగా రాళ్లతో ఖచ్చితమైన కొలతలతో నిర్మించారు. కోనేటికి నలుమూలల నల్లజానపు రాతిగుండ్లు నిర్మించారు. అలాగే పుష్కరిణి మధ్యలో బావి ఉండేలా శిల్పాచార్యులు తీర్చిదిద్దారు. కోనేటికి నాలుగు మహాద్వారములు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎనిమిది ఉపద్వారాలు ఏర్పాటు చేసి, ఈ పుష్కరిణికి స్కంద పుష్కరిణిగా , నీటికి సాలిగ్రామతీర్థమని పేరు ఉంది. ఈ కోనేటిని ఎవరు అవరోదం చేసినా కాశీ క్షేత్రంలో గోవద చేసిన పాపన పోతారని చెరువు తూముపై శిలాశాసనం చేశారు.
మరమ్మతులకు భయపడ్డారు….
అత్యంత నైపుణ్యంతో నిర్మించిన కోనేరులో సుమారు 40 సంవత్సరాల క్రితం దక్షిణదిశలో కోనేటి మెటికలు కొద్దిగా క్రిందకు వగింది. దీనిని మరమ్మతులు చేసేందుకు చెన్నై నుంచి ఇంజనీర్లను పిలిపించారు. పట్టణ ప్రముఖుల సమక్షంలో మరమ్మతులు చేసేందుకు ఇంజనీర్ల బృందం సిద్దమైంది. కానీ రాళ్లను నేరుగా పెట్టేందుకు ప్రయత్నించడంతో కోనేరులోపల అన్ని దిక్కులలోను రాళ్లు కదలడంతో ఇంజనీర్లు భయపడి వదిలివెనుతిరిగారు. నాటి ఇంజనీర్ల పనితీరును నేటి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఇంజనీర్లు చక్కదిద్దలేకపోవడం హాస్యాస్పందం .
జగన్ వంద రోజుల ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం
Tags: The structure of the scapula is amazing