యువకుడికి కత్తిపోట్లు
సంగారెడ్డి ముచ్చట్లు:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. పట్టణంలోని శాంతినగర్ లో అర్ధరాత్రి యువకుడు మన్నాన్ (24)పై కత్తులు, మారణాయుధాలతో దాడి చేశారు. ఛాతి, వీపు, గొంతు, కాళ్లు చేతులపై కత్తులతో తీవ్రంగా దాడి చేయడంతో బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం బాధితుడి పరిస్థితి విషమంగా మారడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షలు నేపథ్యంలోనే దాడి జరిగినట్లు బాధ్యత కుటుంబంలో ఆరోపిస్తున్నారు. ఘటన స్థలాన్ని జహీరాబాద్ పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Tags:The teenager was stabbed