క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభించిన కేంద్ర మంత్రి
విశాఖపట్నం ముచ్చట్లు:
దేశంలోని హెల్త్ కేర్ రంగంలో తొమ్మిదేళ్లలో ఎన్నో గుణాత్మకమైన మార్పులు తీసుకువచ్చామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ ఎల్. మాండవీయ అన్నారు.విశాఖ ఏయూ కన్వేన్షన్ హాల్లో ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన వర్చువల్ గా పాల్గొన్నారు.23 కోట్ల రూపాయలతో 50 పడకల సామర్ధ్యం తో నిర్మించబోయే క్రిటికల్ కేర్ బ్లాక్ కు శంకుస్ధాపన చేశారు.ఈసందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ రోగులు వైద్యుల నిష్పత్తి లో అంతరం లేకుండా చాడాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.మెడికల్ ఎకో సిస్టమ్ తీసుకురావడం ఎంతైనా అవసరమన్నారు.

Tags: The Union Minister started the Critical Care Block
