ధాన్యాన్ని కొనే నాథుడు లేడు
–పండించిన ధాన్యాన్ని కింద ఒంపేసి నిరసన తెలియజేసిన రైతులు
గోకవరం ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణుని పాలెం లో గుర్రాల రాములు రైతు అప్పులు చేసి కష్టపడి పండించిన ధాన్యం కొనే నాధుడు లేక ఏమి చేయాలో తోచక సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సచివాలయం రైతు భరోసా కేంద్రాల వద్ద పండించిన ధాన్యాన్ని ట్రాక్టర్తో తీసుకువచ్చి కింద వంపేసి నిరసన తెలియజేసి అధికారులే తమ సమస్యకు పరిష్కారం చూపించాలంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు.సుమారు 12 ఎకరాల వ్యవసాయం చేస్తుండగా ఐదు ఎకరాలు మాత్రమే ఈ క్రాఫ్ట్ లో నమోదు చేశారని మిగతా ఏడు ఎకరాలు నమోదు కోసం ఎన్నిసార్లు తిరిగినా చదువుకోక అధికారులకు మొరపెట్టుకుంటున్న ఏదో సాకుతో తమను పంపించే వారిని సచివాలయాలు రైతు భరోసాలు వ్యవసాయ శాఖ కార్యాలయాలు చుట్టూ తిరిగి ఈ క్రాఫ్ట్ లో నమోదైన పంటను కొంత కొనే నాధుడు లేక మరి కొంత అధికారుల నిర్లక్ష్యంతో నమోదు కాక ఇంకా చేసే గత్యంతరం లేక పండిన ధాన్యాన్ని ఏం చేస్తారో తమను ఏ విధంగా ఆదుకుంటారో మీరే తెలియజేయాలంటూ ఆర్ బి కే దగ్గర కష్టపడి పండించిన ధాన్యాన్ని పడేసి నిరసన తెలియజేసిన సంఘటన ఇటు తోటి రైతులను అటు చూపర్ల కు బాధ కలిగించింది. రైతు ప్రభుత్వంగా చెప్పుకోవడమే కాదు రైతు సమస్యల పరిష్కారం చేసే విధంగా అధికారులు నాయకులు సహకరించాలని రైతులు వాపోయారు. అధికారులు దిగివచ్చి తాము పండించిన ధాన్యానికి న్యాయం చేసేవరకు తమ నిరసన ఇలానే ఉంటుందని తెలిపారు.
Tags: There is no Nath who buys grain