Natyam ad

అభివృద్ధిలో రాజకీయాలు లేవు

వనపర్తి ముచ్చట్లు:

వనపర్తి మంత్రి రి క్యాంపు కార్యాలయంలో 395 మందికి రూ.3.95 కోట్ల విలువైన బీసీ బంధు ప్రొసీడింగ్స్, 361 మంది దివ్యాంగులకు పెంచిన ఫించన్  రూ.3016 నుండి రూ.4016 ప్రొసీడింగ్స్ లబ్దిదారులకు  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుక్రవారం అందచేసారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్,  రాష్ట్ర సహకార సంస్థల చైర్మన్ రాజా వరప్రసాద్ రావు, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పలుస రమేష్ గౌడ్ , జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, ఎంపీటీసీలు ఇతర  ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ  సంక్షేమం, అభివృద్ధిలో రాజకీయాలు లేవు. కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుభీమా, కళ్యాణలక్ష్మి, న్యూట్రిషన్ కిట్ ల మాదిరిగా పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాల వర్తింపు వుంటుందని అన్నారు.
అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. కుల వృత్తులకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలిచింది. సామాన్యులకు అండగా నిలవాలి అన్నది కేసీఆర్ ఆలోచన. వృత్తులు గతంలో మాదిరిగా వారికి ఉపాధి ఇవ్వడం లేదు.

 

 

 

Post Midle

వారికి ఆర్థిక చేయూత ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచన. దశలవారీగా అందరికీ రూ.లక్ష సాయం. ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకుంటే విడతలవారీగా ప్రతి ఒక్కరికీ సాయం అందుతుంది. 395 మందికి బీసీ బంధు కింద రూ.లక్ష చొప్పున తొలివిడత చెక్కులు పంపిణీ చేసారు. పనిచేసుకునే ప్రతి చేతికి పని కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. గత 9 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ అదే లక్ష్యంతో పనిచేస్తున్నారు. నేడు తెలంగాణ నుండి వలసలు ఆగిపోయాయి .. ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చి ఉపాధి పొందుతున్నారు. అన్నార్తులకు అండగా నిలవాలని ఆసరా ఫించన్లు ఇస్తున్నారు. దివ్యాంగులకు ఫించన్ రూ.4016కు పెంచడం మూలంగా వనపర్తి నియోజకవర్గంలో 6551 మందికి లబ్ది చేకూరింది. రైతును నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఉచిత కరంటు, రైతుభీమా, రైతుబంధు, సాగునీళ్లు ఇస్తూ పండించిన పంటలు కొనుగోలు చేస్తూ అండగా నిలుస్తున్నారు. వ్యవసాయం బాగుపడడంతో దాని చుట్టూ అల్లుకున్న రంగాలు నిలదొక్కుకుంటున్నాయి. వ్యవసాయ రంగం బలపడడంతో అనేక వ్యాపార రంగాలు నూతనంగా ఏర్పాటు అవుతున్నాయని అన్నారు.

 

 

ఒక్క వనపర్తిలో వెయ్యికి పైగా బంగారు దుకాణాలు, 50 వరకు బిర్యానీ సెంటర్లు ఏర్పాటయ్యాయి. కార్ల షోరూంలు, బైక్ షోరూంలు, సూపర్ మార్కెట్ల రాకతో వేల మందికి కొత్తగా ఉపాధి లభిస్తున్నది. ఒకనాడు పదెకరాల రైతు కూడా తిండికి తండ్లాడిన పరిస్థితి వుండేది. తెలంగాణ రాష్ట్రంలో ఆ దుస్థితి నుండి గట్టెక్కడం తెలంగాణ సాధించిన విజయం. సమాజంలో వెనకబడ్డ వారికి కార్పోరేషన్ల ద్వారా చేయూతనందిస్తాం. రాజకీయాలు, పైరవీలు, దళారులకు అతీతంగా సర్కారు పథకాల అమలు చేస్తున్నాం. పనిచేసిన ప్రభుత్వానికి ప్రజలు చేయూతనందించి, అండగా నిలవాలని మంత్రి కోరారు.

 

Tags: There is no politics in development

Post Midle