కృష్ణా జిల్లాకోడూరులో దొంగల కలకలం
రెండు షాపులలో చోరీ.. భారీగా నగదు అపహరణ..
విజయవాడ ముచ్చట్లు:
రెండు దుకాణాలలో చోరీ చేసిన ఘటన కోడూరులో చోటుచేసుకుంది.. కోడూరు ప్రధాన సెంటర్లో బూరగడ్డ గాంధీ, బెంగళూరు బేకరీ షాపులలో బుధవారం ఉదయం1,30 నిమిషాల నుంచి 3 గంటల మధ్య సమయంలో చోరీ జరిగినట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా తెలుస్తోంది. చోరోచేసిన వ్యక్తి పూర్తిగా తెలిసిన వ్యక్తి అయి ఉంటాడని చోరీ జరిగిన విధానాన్ని బట్టి షాపు ల యజమానులు అనుమానిస్తున్నారు. బూరగడ్డ గాంధీ షాపులోకి రెండు అంతస్తు నుంచి చోరీదారుడు లోపలికి వచ్చినట్లు, బెంగళూరు బేకరీ లోకి వెనక ఉన్న తలుపు బద్దలు కొట్టుకొని షాప్ లోకి వచ్చినట్లు యజమానులు తెలుపుతున్నారు.. ఈ విషయంపై పోలీస్ వారు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి చోరీకి పాల్పడిన వారిని పట్టుకొని మాకు న్యాయం చేయాలని బాధిత షాపుల యజమానులు కోరుతున్నారు.
Tags: Thieves riot in Krishna District Kodur