వేల సంఖ్యలో బాతుల మృతి
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం రావుల పాడు గ్రామం చెరువులో మేతకు దిగి వేల సంఖ్యలో బాతులు మృతి చెందాయి. చెరువులో చేపలు పట్టేసి వదిలిన అనంతరం కలుషిత ఆహారం తీసుకున్నందువలనే మృతి చెందాయని పశుసంవర్దక శాఖ వైద్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పంచనామ కోసం తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజ్ కు వాటిని తరలించారు. మృతి చెందిన బాతుల విలువ సుమారు 4 లక్షలు వుంటుందని సమాచారం..
Tags: Thousands of ducks died

