ముగ్గురు దొంగల ఆరెస్టు
సూర్యాపేట ముచ్చట్లు:
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీసులు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులనుంచి భారీ రికవరీ చేసారు. 32 తులాల బంగారు ఆభరణాలు, ఒక కేజి వెండి,ఒక లక్ష ఇరవై వేల రూపాయల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు ,ఒక ల్యాప్ టైప్, మూడు ఎల్ఈడి టీవీలు,ఒక హోం ధీయటర్, మొత్తం విలువ ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కోదాడ పట్టణంలో మొత్తం 8 ఇళ్లలో వరుస దొంగతనాలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Tags: Three thieves arrested

