టమోటకు మద్దతు ధర చెల్లించాలి
మదనపల్లె ముచ్చట్లు:
టమోటా పంటకు గిట్టుబాటు ధర చెల్లించి నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేయాలని లేనిపక్షంలో అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని మాజీ ఎమ్మెల్యే, టిడిపి నాయకులు షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు నాదెళ్ల విద్యాసాగర్, నీలకంఠ, నవీన్, షోఆఫ్ శీన, గిరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టమోటా ధరలు పడిపోవడంతో రైతులు ఆర్థికంగా చితికి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి టమోటాను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి ఆదుకోవాలని లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Tags: Tomato has to pay support price