పుంగనూరులో జాతరను విజయవంతం చేసిన అధికారులకు సన్మానం
పుంగనూరు ముచ్చట్లు:
జమీందారుల కులదైవమైన శ్రీసుగుటూరు గంగమ్మ జాతరను పటిష్టంగా నిర్వహించిన అధికారులను ఎస్సీ, ఎస్టీ మానటరింగ్ కమిటి సభ్యులు సన్మానించారు. శనివారం మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, కమిషనర్ నరసింహప్రసాద్రెడ్డి సీఐ మధుసూదన్రెడ్డి, ఎస్ఐ మోహన్కుమార్ , శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటసుబ్బయ్య, మున్సిపల్ కాంట్రాక్టర్ శ్రీరాములు కు పూలమాలలు వేసి సత్కరించారు. క మిటి సభ్యులు రాజు, అశోక్, భానుప్రసాద్, కృష్ణప్ప ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించి, వారి సేవలను కొనియాడారు. ఈకార్యక్రమంలో శ్రీరాములు, జయరాం తదితరులు పాల్గొన్నారు.

Tags; Tribute to officials who made the fair a success in Punganur
