విజయరామారావుకు మంత్రుల నివాళులు
హైదరాబాద్ ముచ్చట్లు:
మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్, విజయరామారావు మరణించారు. విషయం తెలియగానే రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, చామకూర మల్లారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మల్యే మాగంటి గోపీ నాథ్ తదితరులు. బంజారా హిల్స్ లోని అయన వారి ఇంటికి వెళ్ళి, వారి పార్థీవ దేహం వద్ద పుష్ప గుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. వారితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Tags;Tributes of Ministers to Vijayarama Rao
