ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు-టిడిపి నేత ఆర్ శ్రీనివాసరెడ్డి
కడప ముచ్చట్లు:
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి బుధవారం కడప నగరంలోని సాయిబాబా థియేటర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ
ఆంధ్రుల ఆరాధ్యదైవం, తెలుగుజాతికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి మహనీయుడు ఎన్టీ రామారావు అని కొనియాడారు.
నేడు అమహనీయుడు లేని లోటు తీర్చలేనిదన్నారు
తెలుగుజాతి ఉన్నంతవరకు ఆయన పేరు చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు.
ముఖ్యంగా పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల కోసం, వారి అభ్యున్నతి కోసం, పేదలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఎన్టీ రామారావు అని పేర్కొన్నారు.
పేదలకు 2రూపాయలకే కిలో బియ్యం, పేదలకు జనతా వస్త్రాలు, పేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. సంక్షేమం అంటే ఎన్టీ రామారావు అనే విధంగా దేశవ్యాప్తంగా వన్య తెచ్చిన వ్యక్తి అని చెప్పారురాయలసీమకు హంద్రీనీవా, గాలేరు నగిరి సుజల స్రవంతి, తెలుగు గంగ ప్రాజెక్టులను, రాయలసీమకు ధర్మల్ ప్రాజెక్టును తెచ్చారని చెప్పారు
రాయలసీమ ప్రాంతాన్ని వెనకపడిన ప్రాంతంగా గుర్తించిన మొట్టమొదటి గుర్తించిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు,అయన ప్రారంభించిన ప్రాజెక్టులను తరువాత వచ్చిన పాలకులు కాకుండా మిగితా పాలకులు విస్మరించారని విమర్శించారు
ఆ ప్రాజెక్టులు అన్ని త్వరగా పూర్తి చేయాలనీ ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
Tags; Tributes to NTR statue- TDP leader R Srinivasa Reddy