అమ్మవారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ దంపతులు
తిరుపతి ముచ్చట్లు :
టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం భూమన కరుణాకర రెడ్డి ఆదివారం కుటుంబసమేతంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ కు జేఈవో శ్రీవీరబ్రహ్మం, డెప్యూటీ ఈవో గోవిందరాజన్ స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం పండితులు చైర్మన్ దంపతులకు ఆశీర్వచనం చేసి శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు.

Tags:TTD Chairman’s couple visited Ammavari
