రెండు బస్సులు, ఒక లారీ ఢీ-తప్పిన ప్రాణపాయం
నెల్లూరు ముచ్చట్లు:
గురువారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో నెల్లూరు నగరం లోని మెడికవర్ ఆసుపత్రి సమీపంలో జాతీయ రహదారి పై హైదరాబాదు నుండి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కృష్ణపట్నం పోర్టు నుండి ఉద్యోగస్తులతో నెల్లూరు నగరంలో కి వస్తున్న ఒక బస్సు, ఆదే రహదారిపై వెళ్తున్న లారీ అదుపుతప్పి ఒకదానికి ఒకటి గుద్దుకున్నాయి. ఘటనలో ట్రావెల్స్ బస్సులో ఉన్న సుమారు 25 మంది ప్రయాణికులు, కృష్ణపట్నం బస్సులో ఉన్న సుమారు 15 మంది ఉద్యోగస్తులు, లారీ డ్రైవర్, క్లీనర్ లలో కొందరికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉన్నా ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు… ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Tags: Two buses, one lorry collide – near miss