రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
కాకినాడ ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట శివారు గండేపల్లి మండలం నీలాద్రిరావు పేట జాతీయ రహదారిబ్రిడ్జి శివారు ఆదిత్య హాస్పిటల్ ఎదురుగా జాతీయ రహదారిపై మోటార్ సైకిల్ పై వెళ్తున్న వారిని టాటా సఫారీ వాహనం ఢీకొంది. ఈ . ప్రమాదానికి కారణమైన వాహనానం ఆపకుండా పరారీ అవుతున్న తరుణంలో వాహనాన్ని స్థానికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ రోడ్డు ప్రమాదంలో బైక్ పై వెళుతున్న ఇద్దరు మృతి చెందారు. వీరిలో ఒకరు మహిళ కాగా, మరొకరు పురుషులు వివరాలు తెలియాల్సివుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విచారణ ప్రారంభించారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్రెడ్డి ఆకాంక్ష
Tags: Two killed in road accident