Natyam ad

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

అనకాపల్లి ముచ్చట్లు:


అనకాపల్లి జిల్లా  అచ్యుతాపురం మండలం వెదురువాడ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రాండిక్స్ పరిశ్రమకు చెందిన బస్సు ఢీకొని ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. యాక్సిడెంట్ అనంతరం బస్సుని బస్సు డ్రైవర్ వదిలి పరారయ్యాడు. గాయపడినవారిని అనకాపల్లి ఎన్.టి.ఆర్.హాస్పటల్ కి తరలించారు. అక్కడ  చికిత్సపొందుతూ ఇద్దరు యువకులూ మృతి చెందారు. మృతులు వెదురువాడ గ్రామానికి చెందిన కారుకుండి శ్రీను(25), కిల్లాడి శ్రీను(26). పోలయీసులు  కేసు నమోదుచేసి నిందితుడి ఆచూకీకొరకు ఆరాతీస్తున్నారు.

 

Tags: Two youths died in a road accident