Natyam ad

పుంగనూరులో గడప గడపకు అపూర్వ స్పందన

పుంగనూరు ముచ్చట్లు:

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోందని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గడప గడపకు కార్యక్రమాన్ని మంత్రి పీఏ చంద్రహాస్‌తో కలసి మండలంలోని గురికాళ్ళపల్లె, నల్లగుట్లపల్లెతాండ గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జగనన్న సంక్షేమ బావుట బుక్‌లెట్లను పంపిణీ చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ మండలంలో గడప గడపకు అపూర్వ ఆధరణ లభిస్తోందన్నారు. సమస్యలు లేని మండలంగా చేస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించి సమస్యలు లేని కుటుంభాలుగా మార్చామన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఆర్థికంగా అభివృద్ధి చెందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, పార్టీ నాయకులు జయరామిరెడ్డి, దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, సుబ్బన్నయాదవ్‌, రమణ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Unprecedented response to Gadapa Gadapa in Punganur

Post Midle