పుంగనూరులో వైద్యశిబిరానికి అపూర్వ స్పందన
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని విశ్రాంత ఉద్యోగులచే ఆదివారం నిర్వహించిన వైద్యశిబిరానికి అపూర్వ స్పందన లభించింది. ప్రముఖ ఆర్థోపిడిక్ సర్జన్ డాక్టర్ రెడ్డికార్తీక్, ఈఎన్టి స్పెషలిస్ట్ డాక్టర్ లావణ్య ఆధ్వర్యంలో వైద్యపరీక్షలు చేశారు. 42 మంది రోగులకు పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగ సంఘ నాయకులు డాక్టర్లను సన్మానించి, వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు చెంగారెడ్డి, మునస్వామిమొదలియార్, నాగరాజు, రామకృష్ణారెడ్డి, శంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Unprecedented response to the medical camp in Punganur
