Natyam ad

మీకుదండం…రెండు ఓట్లు ఫ్యాన్‌గుర్తుకు వేయండి

పుంగనూరు ముచ్చట్లు:

మీకు దండం పెడుతున్నాం…ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూడండి… రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించండి..అంటు గురువారం ఉదయం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి గడప గడపకు ప్రచారం చేపట్టారు. మండలంలోని మంగళం గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం చేశారు. అలాగే చదళ్ళ గ్రామంలో పార్టీ నాయకుడు విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేశారు. కుమ్మరనత్తం పంచాయతీలో సచివాలయాల కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అర్హులైన పేదలందరికి సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పనితీరును గుర్తించి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. రెండవ సారి ముఖ్యమంత్రిగా జగనన్నను గెలిపించుకోవాలని లేకపోతే సంక్షేమం ఆగిపోతుందని తెలిపారు. ఈ ప్రచారాలలో పార్టీ నాయకులు విశ్వేశ్వరరెడ్డి, రామమోహన్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, రవి, విజయకుమార్‌, లోకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Up to you…two votes for fanmark

Post Midle