శ్రీవారిని దర్శించుకున్న ఉపసభాపతి
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారిని ఏపి డెప్యూటీ స్పీకర్ కోరగట్ల వీరభద్ర స్వామి దర్శించుకున్నారు.. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో కోరగట్ల వీరభధ్ర స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినంను పురస్కరించుకుని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని స్వామి వారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.. సీఎంకు పరిపాలన పరంగా మరింత శక్తిని ప్రసాదించాలని ప్రార్ధించాలని, రాష్ట్రంలో మంచి శుభ ఫలితాలు అందుతున్న సమయంలో అధికార దాహంతో తప్పుడు పనులు చేసి అధికారంలోకి రావాలని ప్రతిపక్షం కోరుకుంటుందన్నారు.. పరపతి లేని పార్టిలు అన్ని ఏకం అయ్యి అధికారంలోకి రావాలని కుట్ర పొందుతున్నారని ఆయన విమర్శించారు.. రైతు భరోసా పెట్టి రైతుల సంతోషాన్ని సీఎం కోరుకుంటున్నారని, ప్రజలంతా సుఖంగా ఉన్నా వాస్తవాలను అవాస్తవాలుగా,అవాస్తవాలను వాస్తవాలుగా ప్రతిపక్షాలు చిత్రీకరిస్తుందన్నారు..మూడేళ్ళ పరిపాలనలో సీఎం ప్రజాభిమానం సంపాదించారని, రాబోయే ఎన్నికలలో మళ్ళీ సీఎం జగనే కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
Tags: Upasabhapati who visited Sri