వందే భారత్ కు భారీగా ఆదరణ
విజయవాడ ముచ్చట్లు:
సంక్రాంతి కానుకగా.. ఏపీ-తెలంగాణ మధ్య పట్టాలెక్కిన వందేభారత్ ఎక్స్ప్రెస్కు ప్రయాణికుల ఆదరణ పెరుగుతోంది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తున్న ఈ ట్రైన్లో.. సగటున 140 శాతానికి పైగా ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోందని అధికారులు వెల్లడించారు. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 17 వరకు.. 29 ట్రిప్పుల్లో.. సికింద్రాబాద్-విశాఖపట్నం రైల్లో 47వేల 55 మంది.. విశాఖపట్నం-సికింద్రాబాద్ రైల్లో 44వేల 938 మంది ప్రయాణించారు.ఇటు సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్ప్రెస్లో సగటున ఒక ట్రిప్లో 1,623 మంది ప్రయాణిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. వీరిలో అత్యధికంగా సికింద్రాబాద్ నుంచి 1,099 మంది, విజయవాడలో 341 మంది, వరంగల్లో 76, ఖమ్మంలో 55 మంది ఈ రైలు ఎక్కుతున్నట్టు గుర్తించారు. రాజమండ్రి నుంచి 52 మంది ప్రయాణిస్తున్నారు. విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్లో సగటున ఒక ట్రిప్లో 1,550 మంది ప్రయాణిస్తున్నారు.
అత్యధికంగా విశాఖపట్నంలో 1,049 మంది, విజయవాడలో 297, రాజమండ్రిలో 138, వరంగల్లో సగటున 24, ఖమ్మంలో 41 మంది ఈ రైలు ఎక్కుతున్నారని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెబుతున్నారు.సికింద్రాబాద్-వి

Tags: Vande Bharat is hugely popular
