Natyam ad

తెలుగుదేశం పార్టీ కోడ్‌ ఉల్లంఘన- 4 వాహనాల్లో నేతలు రాక

పుంగనూరు ముచ్చట్లు:

తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చల్లారామచంద్రారెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం నాయకులు నాలుగు వాహనాల్లో ఆర్‌వో కేంద్రం వరకు వచ్చి వాహనాలను పార్కింగ్‌ చేయడం పలువురిని ఆశ్చర్యపరచింది. మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉండగా ఆర్‌వో, పోలీసులు నాలుగు వాహనాలను అనుమతి ఎలా ఇచ్చారని పలు పార్టీలకు చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్‌ అభ్యర్థి , ఎస్‌డిపీఐ అభ్యర్థులు కండువాలను వేసుకుని ఆర్‌వో కేంద్రంలోనికి వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ విషయాలను ఫోటోలు, వీడియోలు తీయ్యడంతో ఒక వాహనాన్ని పోలీసులు పంపేశారు. అలాగే దేశం అభ్యర్థికి తెలుగుదేశం నాయకుడు ఆర్‌వో కేంద్రంలో నుంచి శాలువకప్పడం , సుమారు 10 మంది తెలుగుదేశం నాయకులు ఆర్‌వో కేంద్రంలో నుంచి బయటకు రావడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

Post Midle

Tags:Violation of Telugu Desam Party Code – Arrival of leaders in 4 vehicles

Post Midle