మండపేటలో భువనేశ్వరి పర్యటన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ
కష్టా ముచ్చట్లు:
కష్టాల్లో ఉన్నవారికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్పర్సన్ నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి అని పేరిట ఆమె డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించి వారికి మూడు లక్షల ఆర్థిక సాయం ఆమె అందించారు. కోనసీమ జిల్లాలోని గన్నవరం, అమలాపురం ,రాజోలు ,మండపేట ప్రాంతాల్లో ఆమె పర్యటిస్తున్నారు. భువనేశ్వరికి కి మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. పరిహారం అందుకున్న కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తమకు అండగా ఉందంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Tags: Visit to Bhubaneswar in Mandapet