Natyam ad

ఫ్యాన్‌ గుర్తుకు రెండు ఓట్లు వేయండి

పుంగనూరు ముచ్చట్లు:

రాబోవు ఎన్నికల్లో ప్రతి ఒక్కరు రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా కోరారు. మంగళవారం ఆయన పట్టణంలోని శాంతినగర్‌, రాగానిపల్లెరోడ్డు ప్రాంతాలలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. అలాగే కోనేటిపాళ్యెం, హైస్కూల్‌వీధి ప్రాంతాలలో పిఆర్‌ఆర్‌ వారియర్స్ డాక్టర్లు ప్రభాకర్‌, శివ, శరణ్‌, సుధాకర్‌రెడ్డి, రాజారెడ్డి, త్రిమూర్తిరెడ్డి, ఆవుల హరిప్రసాద్‌, మధుసూదన్‌రెడ్డి, పి.ఎల్‌.శ్రీధర్‌, కృష్ణప్ప, శ్రీనివాసులు, నానబాలగణేష్‌, రెడ్డెప్ప, ఆర్‌కె.రామకృష్ణ, డాక్టర్‌ రమణరావు, బిటి.అతావుల్లా ,రామచంద్ర లు కలసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మే 13న జరగబోవు ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి లను అఖండ మెజార్టీతో గెలిపించాలని , రెండవ సారి ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్నుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ కోరారు. ఈ కార్యక్రమాలలో ముల్లంగి విజయకుమార్‌, లక్ష్మణరాజు, రాజగోపాల్‌, అజిజ్‌, సయ్యద్‌, మురళి, భాస్కర్‌జెట్టి, తుంగ చంద్రశేఖర్‌, మునిరాజ, ఉమాదేవి, సిద్దారెడ్డి , బాషు తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Vote two for the fan symbol

Post Midle