Natyam ad

పుంగనూరులో సంక్షేమబావుటతో నడుస్తున్నాం- ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గడప గడపకు కార్యక్రమంలో ప్రభుత్వం చేసిన పనులు , ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల బుక్‌లెట్లను పంపిణీ చేసి నూతన ఒర ఓడికి శ్రీకారం చుట్టామని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి పీఏ చంద్రహాస్‌ , ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి ఓబిరెడ్డిపల్లెలో గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు నేతలకు ఘన స్వాగతం పలికి, మంగళహారతులతో ఆశీర్వధించారు. లబ్ధిదారులకు జగనన్న బావుట పుస్తకాలను అందజేశారు. ఎంపీపీ మాట్లాడుతూ గతంలో ఏముఖ్యమంత్రి చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన 95 శాతం హామిలను నేరవేర్చడం జరిగిందని తెలిపారు. వీటిని ప్రజలకు వివరిస్తూ బుక్‌లెట్లను పంపిణీ చేస్తున్నామన్నారు. గడప గడపకు వచ్చే ప్రతి సమస్యను అధిక ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే సచివాలయాలకు అందిస్తున్న రూ.20 లక్షలతో అవసరమైన పనులు చేపట్టేలా నివేదికలు తయారు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గంగాధర్‌, ఎంపీటీసీ నాగభూషణ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, మల్లప్ప, బాలాజి, శ్రీరాములురెడ్డి, ప్రకాష్‌రెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, రాజశేఖర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: We are running with welfare well in Punganur- MPP Bhaskar Reddy

Post Midle