వాటి పైనే చర్చించాం.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉమ్మడి ప్రకటన..!
హైదరాబాద్ ముచ్చట్లు:
వైసీపీ పాలన పై తీవ్రస్థాయిలో మండి పడ్డారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్.హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా ఇద్దరు చర్చించు కున్నారు.ఆ తర్వాత ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించారు. ముందుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు.వైసీపీ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని మండి పడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు.పెన్షన్లు తీసేయడం, రైతులు, ప్రజల సమస్యలపై చర్చించామని తెలిపారు. బ్రిటీష్ కాలం నాటి జీవో తో ప్రతిపక్షాలను అణిచి వేస్తున్నారని మండి పడ్డారు పవన్ కళ్యాణ్.వైజాగ్ లో తనను అడ్డుకున్నారని.. కుప్పంలో చంద్రబాబు ను కూడా అలాగే అడ్డుకున్నారని అన్నారు. ప్రభుత్వం ఇలా వ్యవహరించడం దుర్మార్గమన్న పవన్.. జీవో నెంబర్ 1 పై ఎలా పోరాడాలనే అంశం పై చంద్రబాబు తో చర్చించినట్లు తెలిపారు.ఇక చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా..? అని ప్రశ్నించారు. ఇప్పటంలో పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్నారని.. ఆంక్షలతో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారన్నారు. అలాగే తాను ఎక్కడికి పోయినా అడ్డుపడు తున్నారని ఫైరయ్యారు.

గంజాయి, మాదక ద్రవ్యాలపై పోరాడితే తమ ఆఫీస్ పై దాడి చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయని విమర్శించారు. ఏపీ లో ప్రజా జీవితం అంధకారంగా మారి పోయిందన్నారు చంద్రబాబు..ప్రతిపక్షాలపై ఆంక్షలు పెట్టి హింసిస్తున్నారని.. పవన్ సభ పెట్టారని ఇప్పటంలో ఇళ్లు కూల్చేశారని ఆరోపించారు. రోడ్లు వెడల్పు పేరుతో ఇళ్లను కూల్చేశారని.. నల్ల జీవో తెచ్చి ఉన్మాదుల్లా వ్యవహరిస్తారా.? అని మండి పడ్డారు. తన నియోజక వర్గంలో సైతం అడ్డు కుంటున్నారని ఫైరయ్యారు చంద్రబాబు..
Tags: We have discussed about them.. Pawan Kalyan and Chandrababu joint statement..!
