Natyam ad

తిరుమలలో ఉచిత అన్నప్రసాదాలనుస్వాగతిస్తున్నాం..

-అలాగే విఐపి దర్శనాలను రద్దు చేసి.. అందరికి సమానంగా ఉచిత దర్శనాలను డిమాండ్ చేస్తున్నాం….
-కొండపై హోటల్ కార్మికులకు ఉపాధి కల్పించండి….
-తితిదే అన్ని ప్రాంతాల యాత్రికులకు అన్ని రకాల భోజనాలను ఏర్పాట్లు చేయాలి
-టీటీడీ పాలకమండలిని ప్రశ్నించిన సిపిఐ.
 
తిరుమల ముచ్చట్లు:
 
గత ఆరు తరాలకు పైగా వన్యమృగాలు సంచరించే ఆ నాటి కాలం లో దివిటీలు పెట్టుకుని , శ్రీవారిని నమ్ముకొని.. స్వామిని దర్శించుకునే భక్తుల ఆకలి తీరుస్తూ .. జీవిస్తున్న స్థానిక తిరుమల వాసులను నిర్ధాక్షణ్యంగా .. తిరుపతిలో మాధవ నగర్ , తిరుమల నగర్ , రెండవ సత్రం తదితర ప్రాంతాలకు తరలించి వారి బ్రతుకు తెరువును నాశనం చేస్తున్నారని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) జిల్లా అధ్యక్షులు ఏ. రామానాయుడు , నగర కార్యదర్శి జెల్లా విశ్వనాథం , నాయకులు కుమార్ రెడ్డి , రాధాకృష్ణ , తిరుమల కార్యదర్శి రామచంద్రయ్య , శివారెడ్డి , నారాయణబాబు , కేశవులు డిమాండ్ చేశారు… రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించే.. ప్రముఖ రాజకీయ పార్టీలు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని వారి కబంధ హస్తాలలోకి తీసుకుని ఇష్టాను రాజ్యాంగ దోచుకుంటూ స్థానికులను , భక్తులను కష్టాలపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ టీటీడీ బోర్డు సభ్యులు శ్రీవారి సన్నిధి లోని ఓ ప్రైవేట్ హోటళ్లను ఖాళీ చేయించి ముప్పూటలా అన్న ప్రసాదాలను భక్తులకు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.. ఇదే జరిగితే వీఐపీ దర్శనాల రద్దు చేసి , హోటల్స్ లో పనిచేసే కార్మికులకు ఉపాధి కల్పించి అలాగే తిరుపతి తిరుమలలో స్థానికులకు టీటీడీ లో ఉన్న ఎనిమిది వేల ఖాళీల ఉద్యోగాలను ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
 
Tags: We welcome free Annaprasadas in Thirumala.