గొర్రెల పెంపకం లాభదాయకంగా మారుస్తాం
ఆలూరు ముచ్చట్లు:
ఆలూరు నియోజకవర్గం పల్లెదొడ్డి గ్రామంలో మహిళా రైతు నాగమ్మ నిర్వహిస్తున్న గొర్రెల ఫామ్ ని నారా లోకేష్ మంగళవారం పరిశీలించారు. రైతు నాగమ్మ, భర్త కృష్ణన్న గౌడ్ తో మాట్లాడి గొర్రెల పెంపకం లో వారు ఎదుర్కుంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రెండేళ్లుగా షెడ్ ఏర్పాటు చేసుకొని గొర్రెల ఫామ్ నిర్వహిస్తున్నాం. షెడ్ నిర్మాణానికి రెండున్నర లక్షల ఖర్చు అయ్యింది. మొదటి ఏడాది 50 గొర్రెల తో ఫామ్ ప్రారంభించాం. రెండేళ్ల లో రెండు లక్షల నష్టం రావడంతో ప్రస్తుతం 30 గొర్రెలు మాత్రమే పెంచుతున్నాం. ఏడాదికి మేత, దాణా, మందులు, ఇతర ఖర్చులు సుమారుగా రెండు లక్షలు అవుతుంది. ఇంత కష్టం చేస్తే రోజు కూలీ మాత్రమే మిగులుతుంది. ప్రభుత్వం నుండి షెడ్ నిర్మాణం, మేత, దాణా, మందులు కొనడానికి ఎటువంటి సహాయం, సబ్సిడీలు రావడం లేదు అంటూ మహిళా రైతు నాగమ్మ కన్నీరు పెట్టుకున్నారు. లోకేష్ మాట్లాడుతూ అధైర్య పడొద్దు అంటూ నాగమ్మ కు ధైర్యం చెప్పారు. అవగాహన లేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎంత ప్రమాదమో కళ్లారా చూస్తున్నాను.
గొర్రెల పెంపకం కోసం టిడిపి పాలనలో అనేక చర్యలు తీసుకున్నాం. గొర్రెలు కొనడానికి సబ్సిడీ రుణాలు అందించాం. మేత, దాణా, మందులు అన్ని సబ్సిడీ ధర కి అందించాం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం గొర్రెల పెంపకానికి ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వడం లేదు. టిడిపి హయాంలో షెడ్ల నిర్మాణానికి సబ్సిడీ రుణాలు అందించాం. ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి మినీ గోకులంలు ఏర్పాటు చేశామని అన్నారు.కనీసం గొర్రెల పెంపకం కోసం తాగునీరు అందించలేని పరిస్థితి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సబ్సిడీ తో షెడ్లు నిర్మాణం కోసం రుణాలు అందించి గొర్రెల ఫామ్ నిర్వహణ కు సహకారం అందిస్తాం. మందులు, ఫీడ్ అన్ని తక్కువ ధరకు అందించి గొర్రెల పెంపకంలో రైతులకి లాభం వచ్చేలా చేస్తాం అంటూ దైర్యం చెప్పారు.

Tags; We will make sheep farming profitable
