అన్న క్యాంటీన్లు నిర్వహించి తీరుతాం
కళ్యాణదుర్గం ముచ్చట్లు:
ఎన్ని అడ్డంకులు సృష్టిం చినా అనంతపురం జిల్లా కళ్యాణదు ర్గంలో క్యాంటీన్లను నిర్వహిస్తామని కళ్యాణదుర్గం నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు స్పష్టం చేశారు.పార్టీ అధి నేత చంద్రబాబు నాయుడు సూచన మేరకు అన్ని మండల కేంద్రాల్లో ఒక్క రోజు అన్న క్యాంటీన్ లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్ర మానికి ప్రభుత్వం నుంచి ఎన్ని అడ్డం కులు ఎదురైనా నిర్వహించి తీరుతా మని ఆయన స్పష్టం చేశారు. పేదలకు అన్నం పెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా నిర్వహిస్తున్నట్లు ఉమామ హేశ్వర నాయుడు తెలిపారు.కార్యక్ర మంలో మాజీమార్కెట్ యార్డ్ ఛైర్మన్ డొడ్డగట్టనారాయణ,పట్టణ అధ్యక్షుడు మురళి,జిల్లా కార్యదర్శి తలారిసత్తి తదితరులు పాల్గోన్నారు.
Tags: We will manage the canteens