రేషన్ కార్డులకు వెబ్ రిజిస్ట్రేషన్
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఇల్లులేనివారు, అభాగ్యులు, వలసదారులు, ఇతర అర్హులైన వారికి రేషన్కార్డులు అందించేందుకు కామన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్టు కింద 11 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీన్ని ప్రారంభించారు. ఈ నెలాఖరు నాటికి అన్ని రాష్ట్రాల్లోనూ అమలుచేయనున్నారు.అర్హులైన వారిని వేగంగా గుర్తించి రేషన్ కార్డులు అందించడంలో రాష్ర్టాలకు సహకారం అందించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. వలసదారులు, ఇతర లబ్ధిదారులు ఎవరిసాయమైనా తీసుకొని కామన్రిజిస్ట్రేషన్ ఫెసిలిటీలో తమ వివరాలు నమోదుచేసుకొని రేషన్కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వెరిఫికేషన్ కోసం ఆ డాటాను సంబంధిత రాష్ట్రాలకు పంపిస్తారు. వారు రేషన్ కార్డు పొందాక.. వన్రేషన్ వన్ రేషన్ కార్డు ప్రోగ్రామ్ కింద దేశంలోని ఏ రేషన్ షాపులోనైనా ఆహారధాన్యాలు తీసుకోవచ్చు.
Tags: Web Registration for Ration Cards

