వైఎస్సార్సీపీలో సంక్షేమ పాలన
పుంగనూరు ముచ్చట్లు:
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎన్నడు లేని విధంగా సంక్షేమ పాలన సాగుతోందని మున్సిపల్ చైర్మన అలీమ్బాషా అన్నారు. శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కమిషనర్ నరసింహప్రసాద్రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్తో కలసి పట్టణంలోని సాయిబాబాగుడివీధి, బ్రాహ్మణవీధి ప్రాంతాలలో నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగనన్న సంక్షేమబావుట పుస్తకాలను పంపిణీ చేసి, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అంటు విచారించారు. లబ్ధిదారులు సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని, వైఎస్.జగన్మోహన్రెడ్డి చిరకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని తెలిపారు. చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో అర్హులైన పేదలందరికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్షరీఫ్, వైస్ చైర్మన్లు లలిత, నాగేంద్ర, కౌన్సిలర్లు పూలత్యాగరాజు, కసీరున్నిసా, నయీంతాజ్, భారతి, రెడ్డెమ్మ, అమ్ము, తుంగామంజునాథ్, కిజర్ఖాన్, అర్షద్అలి, రామకృష్ణంరాజు, నరసింహులు, జెపి.యాదవ్, రేష్మా, కాళిదాసు, రాఘవేంద్ర, మనోహర్, సాజిదా తదితరులు పాల్గొన్నారు.

Tags: Welfare regime in YSRCP
