Natyam ad

ఏనోట విన్న జగనన్న మాటే

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారని , ఏనోట విన్న జగనన్నమాటేనని పిఆర్‌ఆర్‌ వారియర్స్ డాక్టర్లు శివ , ప్రభాకర్‌, శరణ్‌ లు తెలిపారు. గురువారం పట్టణంలోని కట్టక్రిందపాళ్యెం , ఎంబిటి రోడ్డు, నాగపాళ్యెంలో ప్రచారాలు చేశారు. అలాగే కొత్తపేటలో కౌన్సిలర్‌ మమత, వైఎస్సార్‌సీపీ నాయకుడు లక్ష్మణరాజు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేశారు. మే 13న జరగబోవు ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి లను అఖండ మెజార్టీతో గెలిపించాలని , రెండవ సారి ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్నుకోవాలని కోరారు. ఈ ప్రచారాలలో నానబాలగణేష్‌,శ్రీనివాసులు,రెడ్డెప్ప, పిఎల్‌.శ్రీధర్‌, మహేంద్రరావు, శ్రీధర్‌రెడ్డి, తీర్థానందరెడ్డి, బాలకృష్ణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: What did you hear from Jaganna?

Post Midle