బండి సంజయ్ ముచ్చట్లు:
కొన్ని కారణాల వల్ల నడ్డా గారు రాలేక పోయారు…మరో సారి వస్తా అన్నారు. జేపీ నడ్డా, మోడీ నాయకత్వంలో దేశంలోనే బీజేపీ అతి శక్తి వంతమైన పార్టీగా అవతరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో కాషాయపు రాజ్యం రావాలి. గతంలో బీజేపీని ఉత్తరాది పార్టీ అని విమర్శించారు. తెలంగాణలో ఏ ఉప ఎన్నిక అయిన బిజెపి గెలుస్తుంది. ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. మోదీని తిడుతూ టైం పాస్ పాలిటిల్స్ చేస్తుంది. కేసీఆర్ కొడుకు ట్విటర్ టిల్లు ఉరికించి కొడుతారు.
మోదీని బ్రోకర్ అంతవా…నువ్వు బ్రోకర్ ని అయ్యా పాస్ పోర్ట్ బ్రోకర్ అని ఆరోపించారు. మళ్ళీ ఇక్కడ వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. మునుగొడులో పోలింగ్ ఏజెంట్లు దొరకని పార్టీ తెరాస. టీఎస్పీఎస్సీ లో 30 లక్షల మంది భవిష్యత్ నాశనం అయితే మీ అయ్యా ఎందుకు మాట్లాడలేదు. ఆ బోర్డును రద్దు చేయాలి. నీ కుటుంబం ప్రమేయం లేకపోతే సిట్టింగ్ విచారణతో జరిపించాలి. నా పైన పరువు నష్టం దావా వేశారు. ట్విట్టర్ టిల్లు. లిక్కర్ క్వీన్. హ్యాపీ రావు. రాబోయే రోజుల్లో యుద్ధం కొనసాగిస్తాం. కచ్చితంగా బిజెపి ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేస్తామని అన్నారు.
Tags;What is coming is the BJP Govt