Natyam ad

తిరుమలలో శుభ్రం ఎక్కడ ఉంది-మంత్రిని ప్రశ్నించిన మహిళ

తిరుమల ముచ్చట్లు:


తిరుమల శ్రీనివాసుడిని ఈ ఉదయం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం బయటకు వస్తున్న ఆయనకు విచిత్ర అనుభవం ఎదురైంది. అటుగా వచ్చిన మహిళ ఆయనను గుర్తు పట్టలేదు. అయినా సరే అక్కడ ఉండే సమస్యలు ఏకరవు పెట్టారు.  తిరుమలలో మంత్రి నారాయణ స్వామితో మహిళా భక్తురాలు ఏమన్నారంటే… స్వామీ మీరు ఎవరో కానీ… మీరు మంత్రి పదవి అదా అని అడిగారుదానికి నారాయణ స్వామి తలూపుతూ అవును అన్నట్టు చెప్పారు. పక్కనే ఉన్న వ్యక్తి ఆయన మంత్రే మీ సమస్య ఏంటో చెప్పండి అన్నారు. గదులు కేటాయింపు వద్ద, క్యూ లైన్స్ కొన్ని చోట్ల మురుగు వాసన వస్తుంది కొంచెం పట్టించుకోండి సార్ అంటూ భక్తురాలు తన సమస్యను చెప్పుకున్నారు. అసలు అక్కడ నీట్‌నెస్ ఉందా అంటూ ప్రశ్నించారు. మంత్రి స్పందించి చెప్తానంటూ దండం పెట్టి వెళ్లిపోతున్నా ఆమె తన బాధను వివరిస్తూనే ఉన్నారు. ఈవోకు ఫోన్ చేస్తే కలవడం లేదన్నారు సదరు మహిళా భక్తురాలు. డయల్‌ యువర్ ఈవోకు ఫోన్ చేశామన్నారు. ఈ సమస్యను చెప్తానంటూ అక్కడి నుంచి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వెళ్లిపోయారు.

 

Tags; Where is the cleaning in Tirumala- woman questioned the minister

Post Midle
Post Midle