డబల్ బెడ్ రూమ్ ల కోసం రాస్తారోకో
యాదాద్రి భువనగిరి ముచ్చట్లు:
భువనగిరి పట్టణ డబుల్ బెడ్ రూమ్ ఎంపిక విషయంలో పూర్తిగా అవకతవకలు జరిగాయని అనర్హుదారులు అందోళనకు దిగారు. వార్డు సభలలో ప్రకటించిన ముసాయిదా జాబితా ప్రకటనలో అనర్హుదారులు శనివారం నాడు అర్హులైన పేద వారికే ఇండ్లను కేటాయించాలని హైదరాబాద్ వరంగల్ ప్రధాన రహదారి హైదరాబాద్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, టిపిసిసి ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, కౌన్సిలర్ ఈరపాక నరసింహ తదితరులు నిరసనకు మద్దతు తెలిపారు. రోడ్డుపై బైఠాయింపుతో కాసేపు భారీగా ట్రాఫిక్ జాం అయిది. ,పోలీసుల జోక్యంతో నిరసనకారులు ధర్నాను విరమించుకున్నారు.

Tags;Write for double bedrooms
