విశాఖ ఉక్కు సంకల్పానికి ఏడాది- నారా లోకేష్
అమరావతి ముచ్చట్లు:
విశాఖ ఉక్కు సంకల్పానికి నేటితో ఏడాది పూర్తయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కంటూ నినదిస్తున్న కార్మికులకు ఉద్యమాభివందనాలు తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ, అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకూ టీడీపీ నిరసన గళాన్ని వినిపిస్తూనే ఉందని నారా లోకేష్ పేర్కొన్నారు. పదుల సంఖ్యలో ఉద్యమకారుల ప్రాణత్యాగాలతో ఏర్పాటై, వేలాది మందికి ఉపాధి కల్పతరువుగా మారిన విశాఖ ఉక్కుని కాపాడటానికి సీఎం జగన్ రెడ్డి, వైసీపీ ఎంపీలు కనీస ప్రయత్నం చెయ్యకుండా చేతులెత్తేయడం బాధాకరమన్నారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా విశాఖ ఉక్కుని కాపాడుకుంటామని నారా లోకేష్ పేర్కొన్నారు.
Tags; Year for Visakha Steel Idea- Nara Lokesh