యువతి అనుమానస్పదస్థితిలో మృతి
మంచిర్యాల ముచ్చట్లు:
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో ఒకే రూం లో అద్దెకు ఉంటున్న ట్రాన్స్ జెండర్ మహేశ్వరితో పాటు మరో అమ్మాయి అంజలి రామకృష్ణాపూర్ సమీపంలోనీ అటవీ ప్రాంతంలో గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేసారు. తీవ్ర గాయాలతో ఉన్న అంజలిని మహేశ్వరి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. మహేశ్వరి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మంచిర్యాల పట్టణ పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు. అంజలి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags;Young woman died under suspicious circumstances
