పుంగనూరు పాఠశాలలో సరస్వతిదేవి విగ్రహం ఏర్పాటు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని భగత్సింగ్కాలనీలోని మున్సిపల్ పాఠశాలలో కృష్ణయ్య యాదవ్ సొంత నిధులతో సరస్వతి విగ్రహం ఏర్పాటు చేశారు. శనివారం చైర్మన్ అలీమ్బాషా, ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి, కౌన్సిలర్ భారతి కలసి విగ్రహాన్ని ఆవిష్కరించి, పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రసూల్ఖాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ నాగేంద్ర, ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి జయకృష్ణ, పార్టీ నాయకులు జంగాల కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags: A statue of Goddess Saraswati was erected at Punganur school