డ్రైన్ లో పడి వ్యక్తి మృతి
నర్సాపురం ముచ్చట్లు:
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని శ్రీహరిపేటలో శుక్రవారం రాత్రి ఒక వ్యక్తి డ్రైన్ లో జారీ పడి మృతి చెందాడు. మున్సిపల్ అధికారులు డ్రైన్ ను ఓపెన్ గా వదిలేయడంతో డ్రైన్ లో పడిన వ్యక్తి పై మోటార్ సైకిల్ పడిపోవడంతో రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో ఎవరు చూడకపోవడంతో శనివారం ఉదయం గమనించిన స్థానికులు మున్సిపల్ సిబ్బంది కి సమాచారం ఇవ్వడంతో ఆ వ్యక్తి ని డ్రైన్ లో నుండి తీసినప్పటికి ఆ వ్యక్తి మృతి చెందిఉన్నాడు.దీనితో స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతి చెందిన వ్యక్తి నర్సాపురం మండల వేములదీవి కి చెందిన అడ్డాల రవి గా గుర్తించారు.మృతుడికి శుక్రవారం ఒక పాప పుట్టిందని తన సోదరి ఇంటికి వెళ్లేందుకు ఈ మార్గంలో వెళ్తుండగా డ్రైన్ పై ప్లేట్ లు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెప్తున్నారు.ఏది ఏమైనా మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక వ్యక్తి మృతి చెందాడు.
Tags: A person died after falling into the drain