Natyam ad

నిజామాబాద్ జిల్లాలో కొకైన్ కలకలం

నిజామాబాద్ ముచ్చట్లు:

నిజామాబాద్ జిల్లాలో కొకైన్ కలకలం రేపుతోంది. నిషేధిత మత్తుపదార్థాలు తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు.12 గ్రాముల కొకైన్, గంజాయి పౌడర్,ఇతర మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. హైద్రాబాద్ కు చెందిన ద్వారం పూడి విక్రమ్,షేక్ యూసుఫ్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.డ్రగ్స్ తరలిస్తున్న స్కోడా కారు మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు.నూతన సంవత్సర వేడుకల కోసం ఢిల్లీ నుంచి హైద్రాబాద్ కు డ్రగ్స్ తరలిస్తుండగా డిచి పల్లి శివారులో జాతీయ రహదారిపై  టాస్క్ ఫోర్స్ పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు. నిందితులకు వైసిపి తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.కేసు వివరాల ను అడిషనల్ సిపి జయరాం మీడియా కు వెల్లడించారు. డ్రగ్స్ మాఫియా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనేదానిపై పోలీసులు అరా తీస్తున్నారు.

Post Midle

Tags: Cocaine riot in Nizamabad district

Post Midle