ఆటవీ శాఖ సిబ్బంది నిరసన ర్యాలీ
అదిలాబాద్ ముచ్చట్లు:
భద్రాది కొత్తగూడెం జిల్లా బెండాలపాడు అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావును పోడు భూముల వ్యవహరంలో హత్య చేయడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల అటవీ శాఖ అధికారులు, సిబ్బంది వీధుల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి బైక్ భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ.. విధి నిర్వహలో భాగంగా ప్రభుత్వ ఉన్నత అధికారుల ఆదేశాల ప్రకారం విధులు నిర్వర్తించే అధికారిని కిరాతకంగా హత్య చేయడం హేయమైన చర్య అని దీనిని ఖండిస్తూ నిరసన వ్యక్త పరుస్తూ బైక్ ర్యాలి చేపట్టడం జరిగిందని అన్నారు….అటవీశాఖ సిబ్బంది రక్షణకు ప్రభ్యత్వం ఆయుధాలు కేటాయించాలని కోరారు.
Tags: Forestry Department staff protest rally

