ప్రభుత్వ పాఠశాలలో శవం పూడ్చారని పాఠశాల బంద్
అనంతపురం ముచ్చట్లు:
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం , యర్రగుంట గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రామస్థులు మూసివేసారు.పాఠశాల స్థలానిక అక్రమంగా పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చారని ఆరోపించారు. పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న వ్యక్తి, తన భార్య శవాన్ని పాఠశాల స్థలం లో పూడ్చినందుకు నీరసన తెలిసారు. .పాఠశాలకు తాళాలు వేసి నిరసన తెలిపారు. ప్రవేటు వ్యక్తులు పాఠశాలకు విక్రయించిన తర్వాతనే పాఠశాలను నిర్మించుకున్నామని, రెవెన్యూ అధికారుల తప్పిదం వల్ల నేడు గ్రామంలోని పాఠశాల వద్దె శవాన్ని పూడ్చారన్నారు. వెంటనే పాఠశాల కు అక్రమంగా ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకం రద్దు చేయాలనీ డిమాండ్ చేసారు. పాఠశాల స్థలం పరిష్కరించేంత వరకు పాఠశాల బంద్ చేస్తామని, ఇలా పాఠశాలకు కేటాయించిన స్థలంలో శవాన్ని పూడ్చడంతో విద్యార్థులు భయందోళనకు గురి అవుతున్నారని అన్నారు. సమస్య పరిస్కారమయ్యే వరకు విద్యార్థులను పాఠశాలకు పంపమని విద్యార్థుల తల్లీ తండ్రులు తెగేసి చెప్పారు..
Tags: A school bandh where a corpse was buried in a government school