సమరయోధుడికి సన్మానం
పుంగనూరు ముచ్చట్లు:
స్వాతంత్య్ర సమరయోధుడు జంగం శివశంకరయ్యను ఆదివారం ఘనంగా సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు శ్రీనాథరెడ్డి కలసి సమరయోధుడికి శాలువకప్పి , పూలమాలలు వేసి సన్మానించి ఆయన సేవలను కొనియాడారు. 100 వసంతాలు పూర్తి చేసుకున్న శివశంకరయ్య లాంటి వ్యక్తులు సమాజానికి ఆదర్శ వంతులుగా నిలుస్తారని మాజీ ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పూలత్యాగరాజు, కొత్తపల్లి చెంగారెడ్డి, ఆవుల అమరేంద్ర, హరిప్రసాద్, మునిరాజ, రాజారెడ్డి, కిషోర్, నటరాజ, ఉజ్వలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags; A tribute to the warrior