ముస్లింలకు రక్షణ జగనన్న పాలనలోనే – ఎమ్మెల్సీ జకీయాఖానం
పుంగనూరుముచ్చట్లు:
ముస్లిం మైనార్టీలకు రక్షణ, అభివృద్ధి జగనన్న పాలనలోనే అని ఎమ్మెల్సీ, డిప్యూటి చైర్ పర్శన్ జకీయాఖానం అన్నారు. శనివారం ఆమె సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్చార్జ్ ఫకృద్ధిన్షరీఫ్, కౌన్సిలర్లు రేష్మా, భారతి, రాఘవేంద్ర, సాజిదాబేగంతో కలసి ఎన్ఎస్.పేట, కుమ్మరవీధి ప్రాంతాలలో ఇంటింటా పర్యటించారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేశారు. ముస్లిం మహిళలతో ఇంటింటికి వెళ్లి సమావేశాలు నిర్వహించారు. వైస్సార్సీపీ ప్రభుత్వంలో రిజర్వేషన్లు అమలు చేయడంతో ముస్లింలు ఎంతగానో అభివృద్ధి చెందారని తెలిపారు. నవరత్నాల పేరుతో ముస్లింలకు ఎంతో లబ్ధిచేకూరి , ఆర్థికంగా ఉండటానికి కారణం ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. కూటమి అభ్యర్థులుగా వస్తున్న కమలము, సైకిల్, గ్లాస్ గుర్తులకు ఓటు వేస్తే మనకు చేటు తప్పదని హెచ్చరించారు. మత తత్వపార్టీలతో క్రిష్టియన్, ముస్లింలకు రక్షణ లేదని , శాంతియుత జీవనం సాగించలేమని తెలిపారు. ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకటమిధున్రెడ్డి లకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ విజయంతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు అస్లాంమురాధి, రషీదాబేగం, గౌరమ్మ, నయాజ్ తదితరులు పాల్గొన్నారు.
Tags; MLC Zakiyakhanam is in the regime of protection of Muslims