విజయవంతమైన క్రాప్ వెల్ సీడ్స్ రైతు ప్రదర్శన
నాగర్ కర్నూల్ ముచ్చట్లు:
నియోజకవర్గంలోనూ తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలో బుధవారం మహాలక్ష్మి ఫర్టిలైజర్స్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ డీలర్ జాజుల బాలరాజు ఆధ్వర్యంలో ఎండుమిర్చి హనుమాన్ 167 రకం పై నిర్వహించిన క్రాప్ వెల్ సీడ్స్ రైతు ప్రదర్శన విజయవంతమైంది. ఇంద్రకల్ ఐతోల్ యాదిరెడ్డిపల్లి గగ్గలపల్లి గుంతకోడూరు గుండూరు గ్రామాలకు చెందిన అనేక మంది రైతులు ఈ రైతు ప్రదర్శన క్షేత్రంలో పాల్గొని సమస్యలను తెలుసుకున్నారు ఈ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి సాయి రమేష్ సర్పంచ్ రమణ ప్రారంభించగా కంపెనీ మార్కెటింగ్ అధికారి రవీందర్ రైతులు అడిగిన పని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో పాటు కింది మరియు పై ముడుత పురుగుల నివారణకు తమ కంపెనీ సీడ్స్ ఎంతో దోహదం చేస్తాయని రైతులు అధిక దిగుబడి సాధించేందుకు క్రాప్ వేలు సీడ్స్ లో వ్యవసాయంలో వేయాలని కోరారు పూతల పురుగు నివారణ తమ ప్రత్యేకతగా ఆయన వివరించారు ఈ సందర్భంగా సర్పంచ్ రమణ మాట్లాడుతూ రైతులు పంటల మార్పిడితో అధిక దిగుబడి సాధించే ఆర్థికంగా ప్రాజెక్టులకు మారాలని కంపెనీ యాజమాన్యం మరియు శాస్త్రవేత్తల సూచనలు సలహాలు పాటించాలని కోరారు రైతు మాజీ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి కంపెనీ సీడ్స్ వినియోగం ద్వారా పెరిగిన ఉత్పత్తిపై పలు సూచనలు చేశారు
Tags: Successful Crop Well Seeds Farmer Show