Natyam ad

ఐటీ దాడులకు భయపడేదిలేదు

సూర్యాపేట ముచ్చట్లు;


భువనగిరి ఎమ్మెల్యే  పైల్ల శేఖర్ రెడ్డి మీద ఐటీ దాడులపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై జరిగే ఐటీ దాడులన్నీ.. బీజేపీ ప్రేరేపిత దాడులే. విచారణ సంస్థలను అడ్డం పెట్టుకుని.. ప్రతిపక్షాలపై దుర్మార్గంగా వ్యవహారిస్తున్న బీజేపీ. కేసులు పెట్టి బయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మా వారంతా తెరిచిన పుస్తకాలే.. వైట్ పేపర్ వ్యాపారాలే. పార్టీలోకి రాక ముందు నుండే వారికి వ్యాపారాలు ఉన్నాయి. పన్నులు లెక్క ప్రకారమే చెల్లిస్తున్నారు. ఐటీ దాడులతో బయపెట్టడం మూర్ఖత్వమే.. దాడులకు బయపడేదిలేదు.  కేంద్రo దాడులతో ప్రజలను, ప్రతిపక్షాన్ని అణచివేయడం అప్రజాస్వామికం. బీజేపీ ది ముమ్మాటికీ రాజకీయ కక్షే. -ఎన్ని దాడులు చేసినా మేము ప్రజల పక్షమేనని అన్నారు.
Tags:There is no fear of IT attacks

Post Midle