రీజినల్ రింగ్ రోడ్ హద్దు రాళ్లను నాటిన అధికారులు
యాదాద్రి భువనగిరి ముచ్చట్లు:
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ఇబ్రహీంపురం గ్రామ సమీపంలోని పంట పొలాల్లో అధికారులు సర్వే నిర్వహించి హద్దు రాళ్లను నాటారు. రీజినల్ రింగ్ రోడ్డు హద్దుల కోసం ఈ సర్వే జరింది. అయితే , పండగ సమయాల్లో రైతులు లేకపోవడం, వారు లేని సమయంలో హద్దు రాళ్లు నాటడం జరిగిందని దానిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్థానిక రైతులు అంటున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన పోరంబోకు, ప్రభుత్వ భూములలో ఉన్న పేద రైతులు దీంతో దిక్కుతోచని స్థితిలో వున్నారని వారంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ముందుగా ఏ విధంగా సూచించారో అదేవిధంగా రోడ్డు విస్తరణ సంబంధించిన దానిని ఆమోదింప చేయాలని కోరుతున్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్రెడ్డి ఆకాంక్ష
Tags: Officers planting regional ring road boundary stones